ఆంధ్రప్రదేశ్‌

కాళ్లవాపు వ్యాధితో గిరిజనుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, సెప్టెంబర్ 7: కాళ్లవాపు వ్యాధి లక్షణాలతో తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం ఎజి కోడేరు గ్రామానికి చెందిన అగరం లక్ష్మయ్య (70) గురువారం మృతిచెందారు. గత కొన్ని రోజుల నుంచి లక్ష్మయ్య కాళ్లవాపు వ్యాధి లక్షణాలతో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు చింతూరు ఏరియా వైద్యశాలకు తీసుకువెళ్లారు. గురువారం లక్ష్మయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అం బులెన్స్ ద్వారా రంపచోడవరం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈక్రమంలో మార్గమధ్యలోనే లక్ష్మయ్య మృతిచెందాడు. కాగా గతేడాది ఆగస్టులో లక్ష్మయ్య కుమారుడు అప్పారావు సైతం కాళ్లవాపు వ్యాధితో మృతిచెందాడు.