ఆంధ్రప్రదేశ్
తీవ్రవాదాన్ని అణచి వేయాలి: కెవిపి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 22 May 2016
హైదరాబాద్, మే 21: తీవ్రవాదాన్ని సమూలంగా అణచి వేసినప్పుడే దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని ఎపి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు అన్నారు. శనివారం రాజీవ్ గాంధీ 25వ వర్ధంతి సందర్భంగా ఎపి కాంగ్రెస్ కార్యాలయమైన ఇందిరా భవన్లో రాజీవ్ చిత్ర పటానికి కెవిపి పూలదండ వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కెవిపి ప్రసంగిస్తూ 1984 సంవత్సరంలో ప్రధాని ఇందిరా గాంధీని తీవ్రవాదులు పొట్టన పెట్టుకోవడంతో, అత్యంత విషాదకర పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారని అన్నారు. రాజీవ్ గాంధీని కూడా తీవ్రవాదులు హతమార్చడం చాలా దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.