ఆంధ్రప్రదేశ్‌

బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరిగే నేతలు మా పార్టీలో లేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మే 21: రోజూ కోర్టులకు వెళ్లి బెయిల్ కోసం ప్రయత్నాలు చేసే నేతలు టిడిపికి అవసరం లేదని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు వ్యాఖ్యానించారు. తప్పులు ఎవరో చేస్తే శిక్షలు అధికారులకు అనే విధానం టిడిపి ప్రభుత్వంలో ఉండదన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. శనివారం జరిగిన మహానాడులో కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ చర్చల ద్వారా తెలుగు మాట్లాడే ఆంధ్ర, హైద్రాబాద్ రాష్ట్రం ఒక్కటిగా ఏర్పడితే, చర్చలకు అవకాశం లేకుండా ఉమ్మడి రాష్ట్రాన్ని యుపిఏ ప్రభుత్వం విడగొట్టిందని విమర్శించారు. రాష్ట్ర విభజనపై అన్ని పార్టీలతో చర్చ జరపాలని అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు కోరారని, ఢిల్లీలో దీక్ష కూడా చేసారని చెబుతూ యుపిఏ ఇవేమి పట్టకుండా విడదీసిందని విమర్శించారు.