ఆంధ్రప్రదేశ్‌

ఉత్తమ సాహస పర్యాటక రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 11: రాష్ట్ర పర్యాటకశాఖకు మరో అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్ఠాత్మక ఎడ్వంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌ను ఉత్తమ సాహస పర్యాటక భారతీయ రాష్ట్రంగా ప్రకటించింది. సాహస క్రీడలు, సాహసోపేతమైన ప్రయాణం వంటి రంగాలను ప్రోత్సహిస్తున్నందుకు గాను రాష్ట్రానికి ఈ అవార్డు లభించిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా వివరించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సగటున ప్రతినెలా ఒక అవార్డును పర్యాటకశాఖ దక్కించుకుంటోందన్నారు. తమ అధికారులు, సిబ్బంది చేస్తున్న నూతన ఆవిష్కరణల ఫలితంగానే ఇది సాధించగలిగామన్నారు. ఈనెల 19వ తేదీన కేరళ వేదికగా జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో ఎపిటిడిసి ఎండి హిమాన్షు శుక్లా ఈ పురస్కారాన్ని అందుకుంటారని మీనా పేర్కొన్నారు. మరోవైపు ఈవెంట్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ మానేజ్‌మెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించిన అవార్డుల్లో రెండింటిని ఆంధ్రప్రదేశ్ టూరిజం సొంతం చేసుకుందన్నారు. ప్రభుత్వపరమైన ఈవెంట్లకు సంబంధించిన విభాగంలో 48 ఎంట్రీలు రాగా తొలి రెండు స్థానాల కోసం మనకై మనమే పోటీపడినట్టు అయిందన్నారు. గోల్డెన్ ఈవెంట్‌గా 2017 ఫిబ్రవరిలో నిర్వహించిన విశాఖ ఫెస్టివల్, సిల్వర్ ఈవెంట్‌గా అమరావతి మ్యూజిక్ ఫెస్టివల్ రికార్డులకు ఎక్కాయి. ఇది సాధారణ విషయం కాదని ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న ఒక నూతన రాష్ట్రం జాతీయ స్థాయిలో వరుసగా తొలి రెండు స్థానాలను దక్కించుకోవటం ప్రభుత్వ సత్తాను వెల్లడిస్తుందన్నారు. ఇదిలా ఉండగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ భువనేశ్వర్ వేదికగా నిర్వహించిన 33వ వార్షిక సదస్సులో ఏపి టూరిజం ఏర్పాటు చేసిన స్టాల్ ఉత్తమమైనదిగా ఎంపికైంది. ఏపిటిడిసి ఎండి హిమాన్షు శుక్లా స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ చేపడుతున్న కార్యక్రమాలను జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందేందుకు కృషి చేస్తారని తెలిపారు. ఈ క్రమంలోనే 2018లో ఈ సదస్సును నిర్వహించే అరుదైన అవకాశం ఆంధ్రప్రదేశ్‌కు లభించిందని మీనా తెలిపారు.