ఆంధ్రప్రదేశ్‌

మన్యానికీ హైవే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, సెప్టెంబర్ 12: విశాఖ మన్యాన్ని కలుపుతూ జాతీయ రహదారి నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. విశాఖ మన్యంలోని అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల్లో ఆయన మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా మన్యంలోని రహదారుల స్థితిగతులను పరిశీలించారు. అనంతరం పాడేరులో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కొత్తగా నిర్మించబోయే జాతీయ రహదారిని రాజమండ్రి నుంచి రంపచోడవరం, కృష్ణదేవిపేట, లంబసింగి, చింతపల్లి పాడేరు, అరకులోయ, ఎస్.కోట మీదుగా విజయనగరం కలెక్టరేట్ కార్యాలయం జంక్షన్ వరకు 418 కిలోమీటర్ల పొడవునా నిర్మిస్తారన్నారు. రెండు లేన్లలో నిర్మించే ఈ రహదారికి జాతీయ రహదారి నెం.516-ఇ అనే నెంబర్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే మన్యం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.