ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో ఇళ్ల నిర్మాణం 18 నెలల్లో పూర్తి: నారాయణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 10: రాజధాని అమరావతిలో ఉద్యోగులు, ఐఎఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన గృహ నిర్మాణం పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మంగళవారం మాట్లాడుతూ ఇప్పటికే టెండర్లను పిలిచామన్నారు. 4500 మందికి వసతిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్మాణాలను చేపడుతున్నామన్నారు. ఇందుకు సంబంధించి వివిధ అపార్టుమెంట్ల డిజైన్లను పరిశీలించి, ఖరారు చేశామన్నారు. ఆధునిక సౌకర్యాలతో నిర్మించనున్నట్లు తెలిపారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు, ప్రైవేట్ సంస్థలకు మంత్రివర్గ సమావేశంలో 153 ఎకరాలను కేటాయించినట్లు చెప్పారు.