ఆంధ్రప్రదేశ్‌

పాదయాత్ర ఆరోగ్యానికి మంచిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుబోలు, అక్టోబర్ 12: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టదలచిన పాదయాత్ర వల్ల ఆయనకు మంచి ఆరోగ్యం వస్తుందంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గురువారం ఆయన నెల్లూరు జిల్లా మనుబోలు మండల పరిధిలోని కాగితాలపూరులో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఈ సమావేశంలో జగన్ పాదయాత్రపై మీ కామెంట్ ఏమిటంటూ ఓ విలేఖరి ప్రశ్నించడంతో జగన్ పాదయాత్రతో ఆయన ఆరోగ్యానికి మంచిదన్నారు. రాష్ట్ర విభజనతో ఆదాయం తగ్గి లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గ్రామగ్రామాన మూడున్నర సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఆయన కళ్లకు కనిపిస్తుందని, దానిని చూస్తూ పాదయాత్ర సాగించమని చెప్పండన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన సిమెంటు రోడ్లు, రైతులకు చేపట్టిన కార్యక్రమాలు, ఇళ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, నీరు-చెట్టు పథకం కింద చేసిన కాలువలు, చెరువుల మరమ్మతులు చూడాలన్నారు. దివంగత ఎన్‌టి రామారావుపై సినిమా నిర్మిస్తున్న రాంగోపాల్ వర్మను గురించి ప్రశ్నించగా ఆయన ముఖాన్ని ఓసారి అద్దంలో చూసుకోవాలని ఎద్దేవా చేశారు.