ఆంధ్రప్రదేశ్‌

శ్రీకాళహస్తి వద్ద ఘోర ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, అక్టోబర్ 13: పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి మండలం, రాచగునే్నరి గ్రామం వద్ద ఉన్న శ్రీకాళహస్తి పైప్స్ లిమిటెడ్ కర్మాగారం వద్ద తమిళనాడుకు చెందిన కారును కంటైనర్ లారీ ఢీకొనడంతో కారులో ఉన్న ప్రయాణికులు నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృత దేహాలు కారులో ఇరుక్కుపోయాయి. కంటైనర్ కూడా బోల్తాపడింది. దీంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తమిళనాడులోని తిరుపూరుకు చెందిన సుందరమూర్తి (55) కారులో తిరుపూరు నుంచి తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుని శ్రీకాళహస్తికి వస్తుండగా నెల్లూరు వైపు నుంచి తిరుపతికి స్కూటర్లతో వస్తున్న కంటైనర్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు, పోలీసులు వాహనం నుంచి మృతదేహాలను వెలికి తీసి శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరారయ్యాడు. కంటైనర్ లారీ ఎక్కడ నుంచి ఎక్కడకి వెళుతున్నదో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఒకే కుటుంబానికి నలుగురు ఒకేసారి దుర్మరణం చెందడం అందరినీ కలచివేసింది. శ్రీకాళహస్తి డిఎస్పీ వెంకటకిషోర్, సిఐ రామచంద్రారెడ్డి, పోలీసులు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. మృతదేహాలను తరలించిన తరువాత వాహనాల రాకపోకలు కొనసాగాయి.