ఆంధ్రప్రదేశ్‌

ఏపిలో జూన్ 2న నవనిర్మాణ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 27: ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరింత చైతన్యవంతం చేయడానికి, తెలుగుదేశం పార్టీని ప్రజలకు చేరువ చేయడానికి జూన్ 2న నవనిర్మాణ దీక్ష చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సిఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో జరుగుతున్న మహానాడు సభలో తొలిరోజు ఆయన అధ్యక్షోపన్యాసం చేస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపైన ఉందన్నారు. ఎన్‌టిఆర్ ఆశయ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నవనిర్మాణ దీక్షా కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అన్ని చోట్ల ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని, 8న మహాసంకల్పం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.