ఆంధ్రప్రదేశ్‌

అనంతలో ముగ్గురికి ఆంత్రాక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరంట్ల, అక్టోబర్ 17: అనంతపురం జిల్లాలో ముగ్గురికి ఆంత్రాక్స్ వ్యాధి సోకింది. నాలుగు రోజుల క్రితం ఆంత్రాక్స్ బారిన పడి సుమారు 50 గొర్రెలు, మేకలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆంత్రాక్స్ బారినపడిన గొర్రెల మాంసం తిన్న ముగ్గురి శరీరంపై బొబ్బలు వచ్చాయి. గోరంట్ల మండలం చెట్లమొరంపల్లిలో ఇప్పటికే ఆంత్రాక్స్ వ్యాధి సోకి 50 గొర్రెలు, మేకలు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆంత్రాక్స్ వ్యాధి సోకి మృతి చెందిన గొర్రె మాంసం తిన్న రంగప్ప, బావక్క, లక్ష్మీదేవమ్మకి ఈ వ్యాధి సోకింది. శరీరంపై బొబ్బలు రావడంతో వీరు స్థానిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. వీరిని పరీక్షించిన వైద్యులు ఆంత్రాక్స్ సోకినట్లు నిర్ధారించారు.