ఆంధ్రప్రదేశ్
భార్యాపిల్లలను చంపిన కసాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 24 October 2017
బి.కోడూరు, అక్టోబర్ 23: అనుమానంతో భార్యా, పిల్లలను చంపిన పరారయ్యాడు ఓ కసాయి. ఈ సంఘటన కడప జిల్లా బి.కోడూరు మండలం పాయలకుంట్లలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రమణారెడ్డి తన భార్య లక్ష్మీప్రియ(23), కూతురు సాయి శ్రీహిత(3), ఏడాది కుమారుడిని ఆదివారం రాత్రి చంపి పారిపోయాడు. సోమవారం ఉదయం ఇంట్లో ముగ్గురు రక్తపుమడుగులో పడి ఉండగా గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతోనే రమణారెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.