ఆంధ్రప్రదేశ్‌

నవంబర్ 6,7 తేదీల్లో ఢాకాలో కామన్‌వెల్త్ స్పీకర్ల సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరప, ఆక్టోబర్ 23: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 63వ కామన్‌వెల్త్ స్పీకర్ల సదస్సు నవంబర్ 6, 7 తేదీల్లో జరగనుందని రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ ఇన్‌ఛార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సదస్సుకు రాష్ట్రం తరపున శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు డెలిగేట్‌గా, పరిశీలకునిగా తాను హాజరవుతున్నట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కరపలో సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. నవంబర్ 8 నుండి రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు జరుగుతాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనపై ఎంతో నమ్మకం ఉంచి మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి అప్పగించారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పెద్దల సభను అర్ధవంతంగా జరిపేందుకు శాయశక్తులా కృషిచేస్తానని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.