ఆంధ్రప్రదేశ్‌

పార్టీని వీడాలనుకుంటే బురద చల్లడం సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, అక్టోబర్ 23: పార్టీని వీడేవారే బురదజల్లుతారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలంగాణ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామివారిని సోమవారం చినరాజప్ప దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అండతో రేవంత్‌రెడ్డి ఉన్నత స్థాయికి ఎదిగారన్న సంగతి మరిచిపోయారన్నారు. పార్టీలో ఇబ్బందులు ఉండవచ్చునని, ఇష్టం లేకపోతే వెళ్తానని చెప్పాలి కానీ మంత్రులకు కెసిఆర్‌తో సంబంధాలు ఉన్నాయని అనడం సమంజసం కాదన్నారు. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే పార్టీలోని నాయకులు, కార్యకర్తలు, మంత్రులు పనిచేస్తారన్నారు. పయ్యావుల కేశవ్, పరిటాల సునీత కుటుంబ సభ్యుల వ్యక్తిగత వ్యవహారాలపై రేవంత్ వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి చినరాజప్ప అన్నారు.