ఆంధ్రప్రదేశ్‌

సిఆర్‌డిఏ అధికారులతో కాంబోడియా రాయబారి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 2: రాజధాని ప్రాంత అభివృద్ధి అధారిటీ (సిఆర్‌డిఏ) అధికారులతో కంబోడియా రాయబారి నవీన్ శ్రీవాత్సవ, ఉగాండాలోని భారత హై కమిషనర్ ఎవిఎస్ రమేష్‌చంద్ర గురువారం సమావేశమయ్యారు. రాజధాని అమరావతి బృహత్ ప్రణాళిక, భూ సమీకరణ విధానం, పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. అలాగే ఇక్కడ ఉపాధి అవకాశాలపై కూడా సిఆర్‌డిఏ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఆర్‌డిఏ కార్యదర్శ అజయ్ జైన్, కమిషనర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఉగాండాలో భారత రాయబారి ఏవిఎస్ రమేష్, ముఖ్యమంత్రి చంద్రబాబును సిఎంఓలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. రమేష్‌ను ముఖ్యమంత్రి సత్కరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. అలాగే కంబోడియాలో భారత రాయబారి నవీన్ శ్రీవాత్సవను కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సత్కరించారు.