ఆంధ్రప్రదేశ్‌

11న పోలవరంలో సీపీఐ బృందం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 5: పోలవరం ప్రాజెక్టుపై పలురకాల వివాదాలు చోటు చేసుకున్న ఈ తరుణంలో ప్రాజెక్టు నిర్మాణ పరిస్థితులను గురించి తెలుసుకునేందుకు సీపీఐ ప్రతినిధి బృందం ఈ నెల 11వ తేదీన పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించనుంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న ప్రతినిధి బృందంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీ రామచంద్రయ్య, కేవీవీ ప్రసాద్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పార్టీ కార్యదర్శులు టీ మధు, డేగా ప్రభాకర్, తదితరులు ఉంటారు.