ఆంధ్రప్రదేశ్‌

ముగిసిన భవానీ దీక్షల విరమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ ( ఇంద్రకీలాద్రి) డిసెంబర్ 14: శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో గురువారం ఉదయం రుత్విక్కులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించటంతో అమ్మవారి భవానీదీక్షలు పరిసమాప్తం అయినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన భవానీదీక్షల విరమణ కార్యక్రమం ఈనెల 10వ తేదీన అమ్మవారి సన్నిధిలో ప్రారంభమై గురవారం అత్యంత ఘనంగా ముగిసింది. ఇంద్రకీలాద్రి పై ఉన్న యాగశాలలో గురువారం ఉదయం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం స్థానాచార్యుడు విష్ణ్భుట్ల శివప్రసాద్ ఆధ్వర్యంలో రుత్విక్కులు హోమగుండాన్ని ఏర్పాటు చేశారు.