ఆంధ్రప్రదేశ్‌

ఇంటి స్లాబ్ కూలి అక్క, తమ్ముడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బైరెడ్డిపల్లి, జూన్ 12: ఇంటి వరండా స్లాబ్ కూలి అక్క, తమ్ముడు మృతి చెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం నాచుకుప్పం గ్రామంలో జరిగింది. రఘుపతి గౌడ్, నాగమ్మ దంపతులు 8 ఏళ్ల క్రితం ఓ ఇంటిని నిర్మించుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. శనివారం రాత్రి వీరి పెద్దకుమార్తె శోభారాణి (20), తమ్ముడు తిప్పలగౌడ్ (18) ఇంటి మిద్దెపై నిద్రించారు. అయితే అర్ధరాత్రి చిన్నపాటి వర్షం కురవడంతో కిందికి వచ్చి వరండాలోని స్లాబ్‌కింద నిద్రపోయారు. స్లాబ్ ఒక్కసారిగా వారిపై కూలిపోయింది. ఈ సంఘటనలో అక్క శోభారాణి, తమ్ముడు తిప్పలగౌడ్ అక్కడికక్కడే మృతి చెందారు. 8 ఏళ్ల క్రితం నిర్మించిన ఇంటి వరండా స్లాబ్‌కు ఎలాంటి ఆధారం లేకపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అందులోను తరచూ వర్షం కురుస్తుండటంతో స్లాబ్ కూలిపోయింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.