ఆంధ్రప్రదేశ్‌

ప్రాచీన కట్టడాల అభివృద్ధికి నిధులు విడుదల చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: ఆంధ్ర రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న ప్రాచీన గుహలు, కోటల పరిరక్షణకు కేంద్రం ప్రత్యేక నిధులు మంజూరు చేసి చర్యలు తీసుకోవాలని అమరావతి అభివృద్ధి అథారిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు కోరారు. ఆయన ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇచ్చారు. గుంటూరు జిల్లాలో కొండపల్లి కోట, ఉండవల్లి గుహలు, కడప జిల్లాలో గండికోట కోట, చిత్తూరు జిల్లా చంద్రగిరి కోటల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్కియాలజీ పరిధిలో గండికోట, చంద్రగిరి కోటలు ఉన్నాయని, కొండపల్లి కోట ఏపి ఆర్కియాలజీ పరిధిలో ఉన్నాయన్నారు. పర్యాటక ప్రదేశాలుగా వీటిని తీర్చిదిద్దాలన్నారు. ఈ ప్రాంతాల్లో కేంద్ర నిధులతో వౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన కోరారు.