ఆంధ్రప్రదేశ్‌

బాలికపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, జనవరి 18: అభం శుభం తెలియని ఏడేళ్ల గిరిజన బాలికపై కామాంధుడు పశువులా ప్రవర్తించి అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన విశాఖ జిల్లా సీలేరులో గురువారం వెలుగు చూసింది. ఈసంఘటనపై స్థానిక పోలీసులు, బాలిక తల్లిదండ్రులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ ఏజెన్సీ గూడెం కొత్తవీధి మండలం సీలేరు దుర్గా వీధికి చెందిన మండే ముని, ప్రమీల దంపతులు కూలిపని చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నారు. వీరికి ఏడేళ్ళ కుమార్తె, ఐదేళ్ళ కుమారుడు ఉన్నారు. గురువారం ఉదయం బాలిక తల్లిదండ్రులు కుమార్తెను ఇంటి దగ్గర ఉంచి కూలి పనికి వెళ్లారు. మైనర్ బాలిక తోటి పిల్లలతో కలిసి ఇంటికి సమీపంలో ఆడుకుంటుండగా సీలేరుకు చెందిన పాంగి జిన్ను(46) వారితో కొద్ది సేపు ఆడి మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి సమీపంలో ఉన్న టేకు తోటలోకి తీసుకెళ్లాడు. అనంతరం మైనర్ బాలిక దుస్తులు బలవంతంగా తీసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సంఘటన అనంతరం భయంతో మైనర్ బాలిక ఇంటికి చేరుకుంది. సాయంత్రం కూలి పని ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తమ కుమార్తె ఏడుస్తూ ఉండటాన్ని గమనించారు. దీంతో బాలికను గట్టిగా నిలదీయగా జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. కుమార్తె చెప్పిన విషయం విన్న వారిద్దరూ నివ్వెరపోయారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయంపై తల్లి ప్రమీల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు జీకె వీధి సీఐ నారాయణరావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.