ఆంధ్రప్రదేశ్‌

కలకలం రేపుతున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 20: కృష్ణాజిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హర్షారెడ్డి పూణెలో అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామానికి చెందిన హర్షారెడ్డి 15 నెలల నుంచి కనిపించకుండా పోయారు. పూణెలోని వొడాఫోన్ కంపెనీలో హర్షారెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. 15 నెలలుగా అతను ఉద్యోగానికి రాకపోయినా 10 నెలల జీతాన్ని హర్షారెడ్డి ఖాతాలో వొడాఫోన్ కంపెనీ జమ చేసినట్టు తెలుస్తోంది. కంపెనీ వాళ్లే తమ కొడుకుని ఏమైనా చేసి ఉంటారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు విజయవాడ వచ్చిన మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావుకు వినతిపత్రం ఇచ్చారు. ఆదివారం పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు.