ఆంధ్రప్రదేశ్
బెయిల్ ప్రయత్నాల్లో తుని కేసు నిందితులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 17 June 2016
కాకినాడ, జూన్ 16: తుని ఘటనలో అరెస్టయ్యి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండులో ఉన్న నిందితుల్లో నలుగురు గురువారం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కూరాకుల పుల్లయ్య అలియాస్ బుజ్జి అలియాస్ దొరబాబు, పల్లా సత్తిబాబు, తిక్కపల్లి సత్యనారాయణ, లగుడు శ్రీనివాసరావు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మెజిస్ట్రేట్ కోర్టులో బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇవి శుక్రవారం బెంచ్పైకి రానున్నట్టు తెలిసింది. ప్రతి శుక్రవారం పిఠాపురం కోర్టులో జిల్లా కోర్టును నిర్వహిస్తుండటంతో ఆ కోర్టు పరిధిలో నివసిస్తున్న సదరు నిందితులు తమకు బెయిల్ మంజూరుచేయాలని దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఈనెల 21వ తేదీ వరకు సిఐడి కోర్టు రిమాండు విధించిన విషయం విదితమే.