ఆంధ్రప్రదేశ్‌

అమెరికాలో మచిలీపట్నం యువకుడి అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 31: కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన యువకుడు అమెరికాలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నం పురపాలక సంఘంలో పనిచేస్తున్న ఉద్యోగి బొమ్మల రామ్మోహనరావు కుమారుడు చైతన్య ఎంఎస్ చదివేందుకు రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగానే్వషణలో ఉన్న చైతన్య ఫ్లోరిడా రాష్ట్రంలో తన స్నేహితులతో కలిసి ఒక రూమ్‌లో ఉంటున్నాడు. ఈ నెల 30వతేదీ సుమారు రాత్రి 10గంటల సమయంలో (్భరత కాలమానం ప్రకారం 31వతేదీ ఉదయం 10గంటలు) సమయంలో మయామి బీచ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందివున్నాడు. విషయం తెలుసుకున్న బంధువులు దుఖ సాగరంలో మునిగిపోయారు. చైతన్య మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదు.