ఆంధ్రప్రదేశ్‌

ఆధార్ తరహాలో భూధార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 31: ‘ఒక్క క్లిక్‌తో భూమికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించే భూసేవ పథకాన్ని ప్రవేశపెడుతున్నాం, రాష్ట్రంలోని పట్టాదారుని భూభాగానికి ఆధార్ తరహాలో భూధార్ విశిష్ట సంఖ్యను అందజేస్తాం’ అని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వెల్లడించారు. సచివాలయం వేదికగా భూసేవ, ఆటోమ్యూటేషన్ ప్రక్రియకు సంబంధించి రెవెన్యూ ఉన్నతాధికారులు ఉప ముఖ్యమంత్రికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో రెవెన్యూ, ఐటి, ఎన్‌ఐసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో భూ వివాదాలు అరికట్టడంతోపాటు రాష్ట్రంలోని భూముల సమగ్ర సమాచారం ఒకే చోట లభ్యమయ్యేలా భూ సేవ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ-ప్రగతి ప్రాజెక్టులో భాగంగా భూసేవ పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి పట్టాదారుని భూ భాగానికి జియో ట్యాగింగ్ చేసి 11 అంకెలతో ఒక సంఖ్య ఇస్తారని, ఈ సంఖ్య ఆధారంగా భూమికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు. జియో ట్యాగింగ్ చేసిన వెంటనే 99 సంఖ్యతో ప్రారంభమయ్యే తాత్కాలిక భూధార్ నెంబర్ ఇస్తామని, భూ వివరాలను సమగ్రంగా విశే్లషించి అవి సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత రాష్ట్ర సెనె్సస్ కోడ్ 28తో ప్రారంభమయ్యే పర్మనెంట్ భూధార్ నెంబర్ అందిస్తారు.
ప్రభుత్వ భూములను సులువుగా గుర్తించే విధంగా విశిష్ట సంఖ్య రెండు సున్నాలతో ప్రారంభమవుతుందన్నారు. భూసేవ వెబ్ సైట్లో మొత్తం 6 శాఖలకు సంబంధించిన సమాచారం రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే, మున్సిపల్, పంచాయతీరాజ్, అటవీశాఖకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామన్నారు. మొత్తం 2.84 లక్షల వ్యవసాయ భూముల వివరాలతోపాటు 50 లక్షల పట్టణ ఆస్తులు, 85 లక్షల గ్రామీణ ఆస్తుల వివరాలను దీని ద్వారా పొందవచ్చన్నారు. జగ్గయ్యపేట మండలంలోని 24 గ్రామాలు, ఉయ్యూరు మున్సిపాల్టీలో ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్టు చేపట్టామని, అది ఫిబ్రవరి 15 నాటికి పూర్తవుతుందని, అక్టోబర్ నాటికి రాష్టమ్రంతటా ప్రాజెక్టుని అమలు చేస్తామన్నారు. దేశంలోనే ఈ తహాలో ప్రాజెక్టు ఎక్కడా అమలులో లేదని, రాష్ట్రంలోనే తొలిసారిగా అమలు చేస్తున్నామని తెలిపారు. రైతుల సమయం, డబ్బు అదా చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆటోమ్యూటేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టామని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఇందుకోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అనుసంధానం చేస్తున్నామన్నారు. వ్యవసాయ భూముల కొనుగోలు, అమ్మకాలు జరిగిన వెంటనే రెవెన్యూ రికార్డుల్లో ఆటోమేటిక్‌గా కొత్త యజమాని పేరు నమోదయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆటోమ్యూటేషన్ అయిన వెంటనే రైతుకు లేదా భూ యజమానికి ఎస్‌ఎంఎస్, ఈ మెయిల్ ద్వారా వివరాలు తెలియజేస్తామన్నారు. రికార్డుల్లో పేరు నమోదైనప్పటికీ 30 రోజుల వరకు ఎలాంటి లావాదేవీలు జరగకుండా, దీనికి నోషనల్ ఖాతా నెంబర్ ఇస్తామన్నారు. రిజిస్ట్రేషన్ జరిగిన తరువాత సంబంధిత భూమి రిజిస్ట్రేషన్‌కి సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని, అన్ని అభ్యంతరాలు పరిష్కారమైన తరువాత రెవెన్యూ రికార్డుల్లో శాశ్వత ఖాతా ఇస్తామన్నారు. గడచిన మూడు సంవత్సరాల్లో రెవెన్యూ శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. రెవెన్యూ శాఖలో తాము తీసుకొచ్చిన ఈ-పంట, లోన్‌ఛార్జ్ క్రియేషన్ మాడ్యూల్ ఈ-పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్ డీడ్‌కు జాతీయ స్థాయిలో ఈ గవర్నెన్స్ క్యాటగిరీ కింద అవార్డులు వచ్చాయని ఉప ముఖ్యమంత్రి వివరించారు.