ఆంధ్రప్రదేశ్‌

పోలవరం సందర్శనకు వెళుతున్న కుప్పం వాసులతో సీఎం భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 3: ఉండవల్లి వచ్చిన కుప్పం నియోజకవర్గ ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుప్పం ఎంపీపీ కె.శ్రీనివాసులు ఆధ్వర్యంలో పలువురు నియోజకవర్గ ప్రజలు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ప్రత్యేక బస్సులో పోలవరం ప్రాజెక్టుకు వెళ్తూ ముఖ్యమంత్రి నివాసానికి వచ్చారు. గుంటూరులో వివిధ కార్యక్రమాలు ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రిని కుప్పం వాసులు కలుసుకున్నారు. ప్రతి ఒక్కరి యోగక్షేమాలు సీఎం అడిగి తెలుసుకున్నారు. కుప్పం ప్రాంత సమస్యలు, వ్యక్తిగత సమస్యలపై ఇచ్చిన వినతులను స్వీకరించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు సందర్శన మరిచిపోలేని జ్ఞాపకంగా ఉంటుందని పేర్కొన్నారు.

చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన కుప్పం వాసులు