ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ దారిలో.. బీజేపీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 10: ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసమయితే టీడీపీ పార్లమెంటులో పోరాడుతుందో, అదే రాష్ట్ర ప్రయోజనాల కోసం అసెంబ్లీలో తామూ గళమెత్తాలని బీజేపీ నిర్ణయించింది. ప్రధానంగా రాయలసీమలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఎక్కువ నిధులు కేటాయించాలన్న డిమాండుతో అటు అసెంబ్లీ, ఇటు కౌన్సిల్‌లో ఆందోళన చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. పార్లమెంటులో ఆందోళనతో కేంద్రాన్ని ఇబ్బందిపెడుతోన్న మిత్రపక్షమైన తెలుగుదేశం దారిలోనే తానూ నడవాలని భారతీయ జనతా పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. హంద్రీ-నీవా, గాలేరి-నగరి, కర్నూలు జిల్లాకు నీటి సరఫరా వంటి కీలక ప్రాజెక్టులకు ఎక్కువ నిధులు కేటాయించేవరకూ ప్రభుత్వంపై ఉభయ సభల్లో ఒత్తిడి తీసుకురావాలని, ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకూ సభలో ఆందోళన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు రాయలసీమకు చెందిన పార్టీ నేతలు ఇటీవలి కాలంలో నాయకత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. నాయకత్వం కేవలం కోస్తా, ఉత్తరాంధ్ర ప్రయోజనాలకే పనిచేస్తోందని, తమ ప్రజల సమస్యలను ప్రస్తావించడం లేదన్న ఫిర్యాదులు పార్టీ నాయకత్వానికి చేసినట్లు సమాచారం. ఇప్పుడిప్పుడే తమ పార్టీ నేతలు సీమ గురించి మాట్లాడుతున్నప్పటికీ, వాటిని పార్లమెంటులో టీడీపీ మాదిరిగా తమ పార్టీ కూడా అసెంబ్లీలో ఆందోళన చేసి సాధించాలన్న ఒత్తిళ్లు నాయకత్వంపై పెరుగుతుండటం వల్లే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సోమవారాన్ని ప్రతి వారం పోలవారంగా మార్చిన చంద్రబాబు, గాలేరి-నగరి, హంద్రీ-నీవా వంటి రాయలసీమ ప్రాజెక్టుల కోసం మంగళవారం, బుధవారంగా ఎందుకు మార్చడం లేదంటూ ఇప్పటికే బయట ప్రశ్నిస్తున్న బీజేపీ, బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీ-కౌన్సిల్‌లో నిలదీయాలని భావిస్తున్నారు. ప్రధానంగా బీజేపీ సీమ సమస్యలు, అక్కడ నిలిచిపోయిన పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పోలవరం మాదిరిగానే 2019 కల్లా పూర్తి చేయాలని డిమాండ్ చేయాలని భావిస్తోంది. కర్నూలు జిల్లా గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టును వచ్చే ఏడాదికల్లా పూర్తి చేయాలని, ఆ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఆందోళన చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. తెలుగుగంగకు నిధులు లేవని, తుంగభద్ర కుడి-ఎడమ కాల్వల ఆధునీకరణ, హంద్రీ-నీవా ప్రాజెక్టు ఫేజ్ 1,2 పూర్తి కాకుండానే 3వ ఫేజ్ పనులు మొదలుపెట్టడంతోపాటు, పేజ్ 1కు రైడనింగ్ పనులు చేపట్టడం, శ్రీశైలం బ్యాక్ వాటర్ వినియోగంలో అన్యాయంపై ప్రస్తావించనుంది. అదేవిధంగా వైద్య, సాగునీటి, పంచాయితీరాజ్, ఐటి, గృహనిర్మాణ, ఆర్ అండ్ బీ, రెవిన్యూ, మునిసిపల్ శాఖలపై దృష్టి సారించాలని నిర్ణయించినట్లు సమాచారం. జీఎస్టీ వచ్చిన తర్వాత కేంద్రాన్ని అప్రతిష్ఠపాలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వ్యాపారులపై జరిమానాల పేరుతో వేధింపులకు పాల్పడుతున్న వైనాన్నీ ప్రస్తావించనుంది. ఆయా శాఖల్లో జరుగుతున్న పనులు, కేంద్రం ఇచ్చిన నిధులతో నడుస్తున్న ప్రాజెక్టుల పురోగతి, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ప్రాజెక్టుల పనితీరు, వాటికి కేటాయిస్తున్న నిధులను ప్రస్తావిస్తూ ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేయనుంది. ముఖ్యంగా కేంద్రం నుంచి వివిధ శాఖలకు వచ్చిన నిధుల వినియోగం, డీపీఆర్ సమర్పణ, యుటిలిటిటీ సర్ట్ఫికెట్లను ప్రస్తావించనుంది. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని టీడీపీ ఆరోపిస్తున్నప్పుడు, రాష్ట్రం కూడా రాయలసీమకు చేస్తున్న అన్యాయం గురించి మేం ప్రస్తావించాలని కదా సీమ నేత ఒకరు ప్రశ్నించారు. ‘మాకు ఈ విషయంలో టీడీపీనే దారి చూపింది. అందుకు వాళ్లకు అభినందనలు. కేంద్రం తగినన్ని నిధులిస్తున్నా బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని పార్లమెంటులో వారు పోరాడుతున్నారు. మరి మేం కూడా ఇక్కడ ప్రాజెక్టులకు బడ్జెట్ కోసం పోరాడాలి కదా? ఇద్దరం కలిసే హామీలిచ్చినందువల్ల ప్రజలు మమ్మల్నీ అడుగుతున్నారు. ప్రధానంగా పోలవరం మాదిరిగానే 2019 కల్లా రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ఒత్తిడి అక్కడి వారిలో ఉంది. దాన్ని మేం అసెంబ్లీ, కౌన్సిల్‌లో ప్రస్తావించి నిర్దిష్ట హామీ వచ్చే వరకూ ఆందోళన చేయాలి. మేం కూడా రాజకీయపార్టీగా ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి కదా? ఇప్పుడు టీడీపీ వాళ్లు చేస్తున్న పోరాటాన్ని మీ మీడియా వాళ్లు హైలెట్ చేస్తున్నారు. ప్రజాసంఘాలంటూ కొందరు ఉద్యమిస్తున్నారు. మేం కూడా రాష్ట్ర సమస్యలపై అసెంబ్లీ-కౌన్సిల్‌లో పోరాడితే ఈ రెండు వర్గాలు ఎలా స్పందిస్తారో మేమూ చూస్తామ’ని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రాయలసీమకు ఎక్కువ నిధులు కేటాయించాలన్న సీమ ప్రజల మనోభావాన్ని టీడీపీ ప్రభుత్వం గుర్తించాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
సీమ ప్రాజెక్టులకు అధిక నిధులు, సీమలో హైకోర్టు నిర్మాణం, వికేంద్రీకరణలో ప్రాధాన్యం వంటి అంశాలను సీమ ప్రజలు తమ ఆత్మగౌరవ సమస్యగా భావిస్తున్న విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఇకపై మోసం చేస్తే చూస్తూ ఊరుకోలేం