ఆంధ్రప్రదేశ్‌

హోదా కోసం చావో రేవో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఫిబ్రవరి 22 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చావో రేవోలా పోరాడుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంగా కేంద్రం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ చిత్తూరు కాంగ్రెస్ కమిటి ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఆర్‌డిఓ కార్యాలయం ముందు ఆంధ్రుల ఆత్మ గౌరవ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి, టిడిపిల అలసత్వం, స్వార్థం కారణంగా రాష్ట్భ్రావృద్ధి పూర్తిగా పడిపోయిందన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు తగినన్ని రాకున్నా పట్టించుకోకుండా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదా రాగం అందుకోవడం దారుణమన్నారు. ఏప్రిల్ 5వ తేదిలోగా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాలకు సవరణలు చేపట్టడంతో పాటు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పార్టీ ప్రతినిధులచే ఏప్రిల్ 6, 7, 8 వ తేదిల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించి పార్లమెంట్‌ను ముట్టడిస్తామన్నారు.