ఆంధ్రప్రదేశ్‌

రహదారుల దిగ్బంధానికి వైకాపా మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), మార్చి 20: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఈనెల 22వ తేదిన జరప తలపెట్టిన రహదారుల దిగ్బంధన కార్యక్రమానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రత్యేక హోదా సాధనలో భాగంగా జరిగే ఏ పోరాటానికైనా, ఏ ఆందోళనకైనా మద్దతు ఇస్తామన్న వైకాపా విధానంలో భాగంగా ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ రహదారుల దిగ్బంధన కార్యక్రమంలో వైకాపా శ్రేణులు పాల్గొనాలని మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో జగన్ పిలుపు ఇచ్చారు. 22వ తేదిన నిర్వహించే ఈ రహదారుల దిగ్బంధన కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులు పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు కృషి చేయాలన్నారు.