ఆంధ్రప్రదేశ్‌

డీజీలుగా పదోన్నతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం): సీనియర్ ఐపిఎస్ అధికారులైన ఎన్‌వి సురేంద్రబాబు, ఏఆర్ అనూరాధలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ)గా పదోన్నతి లభించింది. వీరిద్దరూ 1987 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందినవారే. ప్రస్తుతం సురేంద్రబాబు గ్రేహౌండ్స్ అండ్ ఆక్టోపస్ అదనపు డీజీగా పని చేస్తున్నారు. అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు డీజీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఏఆర్ అనురాధ విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలావుండగా.. సురేంద్రబాబుకు అదనపు డీజీ నుంచి డీజీగా పదోన్నతి కల్పిస్తూ ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సురేంద్రబాబుతో పాటే డీజీగా పదోన్నతి పొందిన ఏఆర్ అనురాధ ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు డీజీగా పని చేస్తున్నప్పటికీ ఇక నుంచి డీజీ హోదాలో పూర్తిస్ధాయి అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు. దీంతో పాటు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా డీజీ హోదాలో కొనసాగేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.