ఆంధ్రప్రదేశ్
నీటి సంరక్షణపై మండలిలో సీఎం, సభ్యుల ప్రతిజ్ఞ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 23 March 2018
విజయవాడ, మార్చి 22: ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర శాసన మండలిలో సభ్యులు గురువారం నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేశారు. తొలుత ముందుగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ చేసేందుకు సిద్ధమై వచ్చారు. కానీ ఆ తరువాత ఆ ప్రతిని మండలి చైర్మన్ ఎన్ఎండి ఫరూఖ్కు ఇచ్చి, ఆయనను చేయించమనన్నారు. చైర్మన్ ప్రతిజ్ఞను చదువగా, సీఎం సహా సభ్యులందరూ ప్రతిజ్ఞ చేశారు. సకల జల రాశుల మనుగడకు జలరాశులే ప్రాణాధారమని గుర్తించి, ప్రతి నీటి బిందువును తన ఆత్మబంధువుగా భావించి.. నీటిని పొదుపుగా వాడుతానని, జలసంక్షరణ చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.