ఆంధ్రప్రదేశ్‌

బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడబోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 24: బీజేపీ చేసే బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు భయపడి చేతులు ముడుచుకు కూర్చునే స్థితిలో ఆంధ్రులు లేరనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు రాసిన బహిరంగ లేఖలో హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి, పార్లమెంటు నిర్ణయాల పట్ల గౌరవం ఉంటే తక్షణమే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలన్నారు. విభజన బిల్లులో పొందుపరచిన అంశాల అమలుకు పూనుకోండి, లేని పక్షంలో చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.సాక్షాత్తూ పార్లమెంటులో చెప్పిన అంశాల అమలుకు నోచుకోకపోవడం విచారకరమన్నారు. ఇది ప్రజాస్వామిక విలువలకు గొడ్డలిపెట్టని రామకృష్ణ అన్నారు. 2014 ఫిబ్రవరి 20న పార్లమెంటులో చెప్పిన అంశాలను అమలు చేయమని తాము కోరుతుండగా మీరు వాటి విషయం తప్ప మిగతావన్నింటి గురించి మాట్లాడుతున్నారని అన్నారు.