ఆంధ్రప్రదేశ్‌

హోదా కోసం 16న రాష్టబ్రంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఏప్రిల్ 13: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని నిరసిస్తూ ఈ నెల 16వ తేదీ రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చినట్లు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తెలిపారు. అనంతపురంలో శుక్రవారం చలసాని విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం విభజన హామీలు, ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇవ్వకుండా ఏపీకి మోసం చేసిందన్నారు. మోదీ ప్రభుత్వంపై వైసీపీ, టీడీపీ, ఇతర పార్టీల ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా చర్చకు రాకుండా పార్లమెంటులోని ఉభయ సభల్లోనూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ బీజేపీతో జతకట్టిన నాలుగేళ్లలో ప్రత్యేక హోదా, ప్యాకేజీపై మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడటం శోచనీయమన్నారు. అందరూ బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.