ఆంధ్రప్రదేశ్
సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన క్రికెట్ లెజెండ్ సచిన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 14 April 2018
విజయవాడ, ఏప్రిల్ 13: సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కలిశారు. సీఎం సింగపూర్ వెళ్లిన సమయంలో సచిన్ కూడా అక్కడే ఉండటంతో శుక్రవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారిద్దరి మధ్య వివిధ అంశాలపై చర్చ జరిగింది. నెల్లూరు జిల్లాలో పుట్టంరాజువారి కండ్రిక గ్రామాన్ని సచిన్ ఇప్పటికే దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఆ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన చేపట్టారు. ఈ గ్రామాభివృద్ధి పనులపై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగింది.