ఆంధ్రప్రదేశ్‌

బంద్‌ను విజయవంతం చేద్దాం: రఘువీరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 15: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం సోమవారం జరిగే బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పోరాటాలు ఉద్ధృతం చేస్తోందన్నారు. ఏపీకి ప్రత్యేక తరగతి హోదా సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని పార్టీలతో కలిసి దీక్షలు, నిరసనలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే హోదా సాధన సమితి బంద్‌కు పిలుపునిచ్చిందన్నారు. ఈ బంద్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోందని తెలిపారు. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగానూ బంద్‌కు దిగుతున్నామని రఘువీరారెడ్డి తెలిపారు. ప్రధాన మంత్రి దీక్ష ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిందన్నారు.