ఆంధ్రప్రదేశ్‌

నేటి బంద్‌ను ఎవరూ అడ్డుకోలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 15: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు జిమ్మిక్కులు మానుకోవాలని, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలును డిమాండ్ చేస్తూ ఈ నెల 16న చేపట్టిన రాష్ట్ర బంద్‌ను ఎవరూ అడ్డుకోలేరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర సాయం పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఇప్పటికి నాలుగేళ్లుగా రాష్ట్రప్రజలను బీజేపీ నాయకులు మాయమాటలతో మభ్యపెడుతున్నారని, ఇంకా ఎన్నాళ్లు మోసగిస్తారని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతుంటే, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అవి అమలు చేయకుండా ఏపీకి ఎంతో చేశామని చెప్పడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర బీజేపీ నేతలు వకాల్తా పుచ్చుకుని పూటకో బూటకపు ప్రకటనలు చేస్తున్నారన్నారు.
స్టేట్‌మెంట్లు, బుక్‌లెట్లు, కరపత్రాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీకి అన్యాయం చేసిన మోదీ, బీజేపీ దీక్షలకు దిగడం ‘మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కిన’ చందంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ చేసిన అన్యాయాన్ని ఎన్నటికీ మరచిపోరన్నారు. సోమవారం రాష్ట్ర బంద్ జరగనుంది కాబట్టి ముందుగా హరిబాబు పుస్తకాన్ని విడుదల చేసి ప్రజలను మభ్యపెట్టే జిమ్మిక్కులు చేస్తున్నారని, అయితే అవి ఏమాత్రం పారవన్నారు. బీజేపీ శ్రేణులు ఇకనైనా ఈ జిమ్మిక్కులు మానుకోవాలన్నారు. రాష్ట్ర బంద్‌లో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొని బీజేపీ నాయకుల ప్రకటనలు తిరస్కరించాలని రామకృష్ణ పిలుపునిచ్చారు.