ఆంధ్రప్రదేశ్‌

అరకును దత్తత తీసుకుంటా : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ : అరకును దత్తత తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసి దినోత్సం సందర్భంగా మంగళవారం అరుకులోని ఎన్టీఆర్‌ గార్డెన్స్‌లో రూ. 68 కోట్లతో పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేసిన ఆయన మాట్లాడుతూ, అరకు కాఫీని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తాని అన్నారు. ఏజెన్సీలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని బాబు స్పష్టం చేశారు. ఏకలవ్య మోడల్‌ స్కూళ్లను ప్రవేశపెడతామన్నారు. స్పెషల్‌ డీఎస్సీతో 301 పోస్టులు భర్తీ చేసినట్లు చంద్రబాబు తెలిపారు. గిరిజన యువతుల వివాహాలకు గిరిపుత్రిక పథకం కింద రూ.51 వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు. అల్లూరి పేరిట ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.