బిజినెస్

పౌర విమానయాన రంగంపై సదస్సును ప్రారంభించనున్న అశోక్ గజపతిరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: ఈ నెల 16 నుంచి 20 వరకు జరగనున్న అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన సందర్భంగా బేగంపేట ఎయిర్‌పోర్టులో 17వ తేదీన పౌర విమానయాన రంగంపై అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సును పౌర విమానయాన శాఖ మంత్రి పి అశోక్ గజపతిరాజు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఫిక్కీ, కెపిఎంజి సంయుక్తంగా రూపొందించిన నాలెడ్జ్ పేపర్‌ను కేంద్ర మంత్రి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో పౌరవిమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్ చౌబే తదితరులు పాల్గొననున్నారు.