తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శని, ఆదివారాల్లోనూ అసెంబ్లీ
హైదరాబాద్, మార్చి 10: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఉభయ సభల (అసెంబ్లీ, కౌన్సిల్) సభ్యులనుద్ధేశించి ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి ప్రతిపక్ష సభ్యుల నుంచి ఎటువంటి ఆటంకాలు ఎదురు కాలేదు. సభలో సభ్యులు ప్రశాంతంగా కూర్చొని గవర్నర్ ప్రసంగాన్ని విన్నారు. గతంలో గవర్నర్ ప్రసంగానికి ప్రతిపక్ష సభ్యులు అడ్డుపడడం, గవర్నర్ ప్రసంగ పాఠం పుస్తకాలను చించి వేసి పైకి విసిరి వేయడం, గవర్నర్ సభలోకి వస్తున్నప్పుడు, వెళుతున్నప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగిన దాఖలాలు ఉన్నాయి. ఈ దఫా అలాంటిదేమీ లేకుండా ప్రశాంతంగా జరిగింది. అయితే సభలోకి గవర్నర్ వచ్చినప్పుడు 11 గంటలకు ఇంకా నాలుగు నిమిషాలు తక్కువగా ఉంది. దీంతో టిడిపి ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి స్పీకర్ వైపు చూస్తూ ముందుగా ఆ గోడలపై ఉన్న గడియారాల్లో సమయాన్ని సరి చేసుకోవాలని అన్నారు. గవర్నర్ 11 గంటలకు సభకు రావాల్సి ఉండగా, ముందే వచ్చారని ఆయన తెలిపారు. ఇలాఉండగా శుక్రవారం సభ ప్రారంభంకాగానే ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డికి సంతాపం తెలియజేస్తారు. ఆ తర్వాత సభ మర్నాడుకు వాయిదా పడుతుంది. అనంతరం స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశం జరుగుతుంది. ఈ సమావేశాల్లో అజెండా ఖరారు చేస్తారు. కాగా నెలాఖరులోగా బడ్జెట్ ప్రతిపాదన, పద్దులపై చర్చ జరిగి, ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించాల్సి ఉన్నందున, శని, ఆదివారాల్లో కూడా సభను నిర్వహించే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.