ఆంధ్రప్రదేశ్
నవనిర్మాణ దీక్షలో అందరూ భాగస్వాములే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 1 June 2016
విజయవాడ: రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లయిన సందర్భంగా చేపట్టే నవ నిర్మాణ దీక్షలో అన్ని వర్గాల వారూ భాగస్వామ్యం కావాలని ఎపి సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆయన బుధవారం ఇక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకూ నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా పల్లె నుంచి జిల్లా కేంద్రం వరకూ సదస్సులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులంతా రాష్ట్ర పునర్నిర్మాణం కోసం దీక్ష వహించాలన్నారు. విభజన సమస్యలు, రెండేళ్లలో సాధించిన ప్రగతి, చేపట్టాల్సిన కార్యక్రమాలు వంటి విషయాలపై సదస్సుల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.