రాష్ట్రీయం

ప్రాజెక్టుల పనులపై చంద్రబాబు సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: 116 రోజులపాటు నీరు-ప్రగతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం ప్రాధాన్యత ప్రాజెక్టుల పనులపై ఆయన మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని నదులను అనుసంధానం చేస్తామన్నారు. రాయలసీమను రతనాల సీమగా చేసి చూపిస్తామని సీఎం స్పష్టం చేశారు. రెండేళ్లు వర్షాలు పడకపోయినా నీటికి కొదవ లేకుండా చేస్తామన్నారు. రాష్ట్రంలో రెండు కోట్ల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. కొండవీటివాగు, పాలవాగులను సమర్థవంతంగా పూర్తి చేస్తామని, పులిచింతల నుంచి సముద్రం వరకు జల రవాణాను అభివృద్ధి చేస్తామని, బ్లూ అండ్ గ్రీన్ నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.