ఆంధ్రప్రదేశ్
పట్టణ ప్రణాళిక లేకే సమస్యలు రెట్టింపు : చంద్రబాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 14 September 2016
విశాఖ: పట్టణ ప్రణాళిక సక్రమంగా లేకపోవడం వల్ల సమస్యలు రెట్టింపు అవుతున్నాయని, పట్టణీకరణను దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విశాఖలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో బుధవారం ఆయన ప్రసంగించారు. దేశాభివృద్ధిలో పట్టణీకరణే కీలకపాత్ర పోషిస్తుందని, పట్టణీకరణలో ప్రధానంగా కాలుష్యం, మురికవాడల సమస్య ఎదురవుతోందన్నారు. 2050 నాటికి అత్యధిక జనాభా పట్టణాల్లోనే ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోనూ పట్టణీకరణకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు.