ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వానికి ముద్రగడ సహకరించాలి: బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: కాపు కులస్థుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సహకరించాలని సిఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఎవరో చెప్పిన మాటలు వినకుండా కాపుల ప్రగతి గురించి ముద్రగడ ఆలోచించాలన్నారు. కాపులకు రిజర్వేషన్ల కోసం కమిషన్‌ను నియమించామని, కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు. ‘కాపులకు ఏమీ చేయని వైఎస్ రాజశేఖరరెడ్డి దేవుడయ్యాడా? అన్నీ చేస్తున్న నేను విరోధినయ్యానా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ఉద్యమం ముసుగులో రైళ్లను, పోలీస్ స్టేషన్లను తగులబెడితే ప్రజలకు ఎవరు భద్రత కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. విధ్వంసానికి పాల్పడిన వారిపై కేసులు పెడితే ముద్రగడకు ఎందుకు అభ్యంతరమన్నారు.