తెలంగాణ

భైంసా ఘటనలో మృతుల సంఖ్య 5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్: పాతకక్షల నేపథ్యంలో భైంసా పట్టణంలో ప్రత్యర్థులు జరిపిన దాడిలో మృతుల సంఖ్య అయిదుకు చేరింది. మాజీ కౌన్సిలర్ వహీదా బేగం, ఆమె భర్త న్యామత్ ఖాన్, బంధువు యూసఫ్ ఖాన్ మంగళవారం ప్రత్యర్థుల దాడిలో హతమయ్యారు. ఈ ముగ్గురిని చంపిన తర్వాత ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడులకు తెగబడ్డారు. వహీదా బేగం బంధువుల ఇళ్లపై ప్రత్యర్థులు దాడి చేసి అక్రమ్ బీ (62), అయేషా (16) లను కూడా దారుణంగా నరికిచంపారు. అయిదుగురు హత్యకు గురికావడంతో భైంసాలో భయానక వాతావరణం ఏర్పడింది. పోలీసులు భారీ సంఖ్యలో చేరుకుని పహారా కాస్తున్నారు.