రాష్ట్రీయం

గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: కొన్ని నెలలుగా వాయిదా పడుతున్న గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ఎట్టకేలకు గురువారం జరిగింది. బోర్డు ఛైర్మన్‌ రామ్‌శరణ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు నియంత్రణ, నిబంధనల్లో కొన్ని సవరణలు చేసి వాటిని కేంద్ర జలవనరులశాఖకు పంపించాలని నిర్ణయించారు. బోర్డు సభ్య కార్యదర్శి సమీర్‌ చటర్జీ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల శాఖ కార్యదర్శులు ఆదిత్యనాథ్‌ దాస్‌, ఎస్‌.కె.జోషి, తెలంగాణ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌, ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు.