బిజినెస్

పెట్టుబడుల జోరులో మదుపరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 12: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా లాభాల్లో ముగిశాయి. సోమవారం భారీ లాభాల నేపథ్యంలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 181.45 పాయింట్లు పుంజుకుని 11 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 27,808.14 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 53.15 పాయింట్లు అందుకుని 8,500 స్థాయికి ఎగువన 8,521.05 వద్ద నిలిచింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) ఆర్థిక ఫలితాలు బాగుంటాయన్న అంచనాల మధ్య మదుపరులు మంగళవారం కూడా పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. మెటల్ షేర్లు అత్యధికంగా 2.87 శాతం లాభపడితే, రియల్టీ, బ్యాంకింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, చమురు, గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్ల విలువ 2.02 శాతం నుంచి 0.25 శాతం పెరిగాయి. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ సూచీ 0.49 శాతం, స్మాల్-క్యాప్ సూచీ 0.08 శాతం చొప్పున ఎగిశాయి. ఇక అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్, చైనా సూచీలు లాభపడగా, ఐరోపా మార్కెట్లలోనూ ప్రధాన సూచీలైన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్‌లు లాభాల్లో కదలాడాయి.