బిజినెస్
రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ఐటెల్ మొబైల్స్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 23 November 2016
హైదరాబాద్, నవంబర్ 22: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఐటెల్ మొబైల్ తమ బ్రాండ్ల విక్రయాలను ప్రారంభించింది. రెండో దశలో భాగంగా ఆ సంస్థ తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించగా, సంస్థ సిఇఒ సుధీర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో తమ అమ్మకాలు చాలా బాగా జరుగుతున్నట్లు చెప్పారు. మొదటి దశలో ఉత్తరాది రాష్ట్రాల్లో సంస్థ వ్యాపారాన్ని విస్తరించామని, రెండో దశలో దక్షిణాది రాష్ట్రాల వ్యాపార విస్తరణపై దృష్టి సారించామన్నారు. కాగా, దేశీయ మార్కెట్లో ఇప్పటికే 5.4 మిలియన్ల ఫోన్లను విక్రయించామని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి 9 మిలియన్ల అమ్మకాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 2,000 రూపాయల నుంచి 10 వేల రూపాయల వరకు తమ సంస్థలో ఫోన్లు లభిస్తాయన్నారు.