బిజినెస్

కింగ్‌ఫిషర్ హౌస్ వేలంలో బ్యాంకర్లకు మళ్లీ చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 19: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల నేపథ్యంలో బకాయల వసూళ్లకుగాను దాని ప్రమోటర్ విజయ్ మాల్యాకి చెందిన ఆస్తుల అమ్మకానికి బ్యాంకులు చేస్తున్న చర్యలు విజయ వంతం అయ్యేలా కనిపిం చడం లేదు. మరోసారి బ్యాంకులు చేసిన ప్రయ త్నం విఫలమైంది మరి. ఇప్పటికే పలుమార్లు ముంబయిలోని కింగ్‌ఫిషర్ హౌస్‌ను వేలం వేసిన బ్యాంకులకు చుక్కెదురవగా, సోమవారం మళ్లీ నిర్వహించిన వేలంలోనూ భంగపాటుకు గురయ్యాయ బ్యాంకులు. 17 వేల చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో నిర్మించిన కింగ్‌ఫిషర్ హౌస్‌ను కొనేందుకు ఒక్కరూ రాలేదు. క్రిందటిసారితో పోల్చితే ధరను 15 శాతం తగ్గించినప్పటికీ స్పందన శూన్యం. మరోవైపు గురువారం కింగ్‌ఫిషర్ విల్లాను బ్యాంకులు వేలం వేస్తున్నాయి. గతంతో చూస్తే దీని ధరను కూడా 5 శాతం తగ్గించారు బ్యాంకర్లు. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కూటమికి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడినది తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్యా దేశం విడిచి పారిపోగా, ఆయన్ను ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా కూడా పలు బ్యాంకులు ప్రకటించాయి. ఈ వ్యవహారం కోర్టుల్లోకి కూడా చేరగా, బకాయిల వసూళ్లలో భాగంగా మాల్యా స్థిర, చరాస్తుల అమ్మకానికి బ్యాంకులు దిగుతున్నాయి. మాల్యా ఇండ్లు, కార్లు, వ్యక్తిగత విమానం ఇలా అన్నింటినీ బ్యాంకులు, ఆదాయ, వాణిజ్య, సేవా పన్ను శాఖలు వేలం వేస్తున్నప్పటికీ కొనేవారే కరువయ్యారు. కాగా, ఈసారి కింగ్‌ఫిషర్ హౌస్ ధరను 115 కోట్ల రూపాయలుగా, కింగ్‌ఫిషర్ విల్లా ధరను 81 కోట్ల రూపాయలుగా బ్యాంకర్లు నిర్ణయించారు.