బిజినెస్

రూ. 450 కోట్లతో కొనేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: నిర్మాణ రంగ దిగ్గజం డిఎల్‌ఎఫ్ చైర్మన్ కెపి సింగ్ కుమార్తె రేణుక తల్వార్.. సెంట్రల్ ఢిల్లీలోని ఓ భవంతిని దాదాపు 450 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఎకరానికిపైగా విస్తీర్ణంలో నిర్మితమైన ఈ భవనం లూటిన్స్ ఢిల్లీలోగల పృథ్వీ రాజ్ రోడ్డు వద్ద ఉంది. నిర్మాణ రంగ సంస్థ టిడిఐ ఎండి కమల్ తనేజా దీన్ని అమ్మేశారు. ఈయన నుంచి తల్వార్ కొనుగోలు చేశారు. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి డిఎల్‌ఎఫ్‌లో తల్వార్ వాటా 0.09 శాతంగా ఉంది. తల్వార్ భర్త జిఎస్ తల్వార్.. డిఎల్‌ఎఫ్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇదిలావుంటే ఈ భవంతిని తల్వార్ కొద్ది నెలల క్రిందటే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక ఆ ప్రాంతంలో పలుకుతున్న ధర కంటే అధికంగా చెల్లించినట్లు సమాచారం. ఈ లావాదేవీపై అటు డిఎల్‌ఎఫ్, ఇటు టిడిఐ స్పందించలేదు. అయితే ఈ భవంతి కొనుగోలుకు మరో ముగ్గురు, నలుగురు పోటీపడినట్లు తెలుస్తోంది. తొలుత ధర 600 కోట్ల రూపాయలు చెప్పినప్పటికీ, చివరకు 450 కోట్ల రూపాయలకు భవంతిని తనేజా అమ్మేసినట్లు సమాచారం. లూటిన్స్ ఢిల్లీలో డిఎల్‌ఎఫ్ అధినేత కెపి సింగ్‌కు ఇప్పటికే రెండు ఆస్తులున్నాయి. ఢిల్లీలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో లూటిన్స్ ఒకటి. ఇక్కడి ఆస్తుల్లో ఇప్పుడు తల్వార్ భవంతినే హాట్ టాపిక్ అయ్యింది.