బిజినెస్
హైదరాబాద్లో ప్లాటినమ్ 3జి ఎయిర్టెల్ ప్రకటన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 15 April 2016
హైదరాబాద్, ఏప్రిల్ 14: ప్లాటినం 3జి నెట్ వర్క్ను హైదరాబాద్లోని తన వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అగ్రశ్రేణి టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్ భారతి ఎయిర్టెల్ తెలిపింది. త్వరలో ఈ సర్వీస్ను ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. ప్లాటినం 3జి నెట్ వర్క్తో ఇండోర్ కవరేజ్, వాయిస్ క్లారిటీలో పెరుగుదల, ఇంటర్నెట్ స్పీడ్ను మరింత వేగవంతం చేసేందుకు దోహదపడుతుందని ఎయిర్టెల్ ఎపి, తెలంగాణ సిఇఓ వెంకటేశ్ విజయరాఘవన్ తెలిపారు. 3జిని వినియోగిస్తున్న వారికి ఇప్పుడు ఉన్న 2100 ఎంహెచ్జడ్కు అదనంగా మరో 900 ఎంహెచ్జడ్ బాండ్ స్ప్రెక్ట్రమ్ వస్తుందని ఎయిర్టెల్ వెల్లడించింది.