బిజినెస్

మార్కెట్లోకి సరికొత్త ఎకోస్పోర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 19: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోర్డ్ ఇండియా లిమిటెడ్ ఎంతో ప్రజాదరణ పొందిన తమ కాంపాక్ట్ ఎస్‌యువి ‘ఎకోస్పోర్ట్’కు అప్‌గ్రేడెడ్ ఎడిషన్‌ను గురువారం మార్కె ట్లో ప్రవేశపెట్టింది. న్యూఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధరను 10.39 లక్షల నుంచి 10.69 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఎకోస్పోర్ట్ ‘ప్లాటినమ్ ఎడిషన్’ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ వాహనం రెండు రకాల ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. వీటిలో 1.5 లీటర్ల డీజిల్ ఇంజన్‌తో నడిచే వాహనం లీటర్ ఇంధనానికి 22.27 కిలోమీటర్ల మైలేజీని, 1.0 లీటర్ ఎకోబూస్ట్ పెట్రోల్ ఇంజన్‌తో నడిచే వాహనం లీటర్ ఇంధనానికి 18.88 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని, వీటిలో డీజిల్ వేరియంట్ ధరను రూ.10.69 లక్షలు (న్యూఢిల్లీ ఎక్స్-షోరూమ్) గానూ, పెట్రోల్ వేరియంట్ ధరను రూ.10.39 లక్షలుగానూ నిర్ణయించామని ఫోర్డ్ ఇండియా ఒక ప్రకటనలో వివరించింది.