బిజినెస్

‘మాల్యా’ కేసులో 8 మంది అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల ఎగవేత కేసులో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిబిఐ బ్యాంక్ మాజీ చైర్మన్‌తోపాటు మరో ముగ్గురు అధికారులను సోమవారం కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ అరెస్ట్ చేసింది. వీరితోపాటు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన నలుగురు మాజీ ఉద్యోగులనూ అదుపులోకి తీసుకుంది. అరెస్టయిన వారిలో ఐడిబిఐ బ్యాంక్ మాజీ చైర్మన్ యోగేష్ అగర్వాల్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ సిఎఫ్‌ఒ ఎ రఘునాథన్ ఉన్నట్లు సిబిఐ వర్గాలు తెలిపాయి. మాల్యా నివాసంతోపాటు 11 చోట్ల సిబిఐ సోదాలు జరిగిన నేపథ్యంలో ఈ అరెస్టులయ్యాయి.